బెంగళూరులో రోడ్డు నామకరణ కార్యక్రమం

20 జనవరి, 2016

ఆ నగరంలోని వై‌.ఎస్‌.ఎస్. భక్తులు చేసిన అధికారిక అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరులోని వై‌.ఎస్‌.ఎస్. ధ్యాన మందిరానికి ఆనుకుని ఉన్న రహదారికి మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందవారి గౌరవార్థం పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం 1965లో స్థాపించబడిన యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం –బెంగళూరు 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేయబడింది.

డిసెంబర్ 30, 2015న మన కేంద్రానికి సమీపంలో జరిగిన కార్యక్రమంలో బెంగళూరు నడిబొడ్డున ఉన్న రహదారికి అధికారికంగా “పరమహంస యోగానంద రోడ్” అని పేరు పెట్టారు. కర్ణాటక పట్టణ ప్రణాళిక & అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కె.జె.జార్జ్ ప్రారంభోత్సవాన్ని చేశారు మరియు బెంగళూరు శాంతినగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్.ఎ.హరీస్ అధ్యక్షత వహించారు. బెంగళూరు మేయర్ శ్రీ బి.ఎన్.మంజునాథ్, 80వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ ఎస్.ఆనంద్ కుమార్, అప్పిలేట్ కమిటీ అధ్యక్షుడు, బెంగళూరు సహా ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై‌.ఎస్‌.ఎస్. తరఫున స్వామి శుద్ధానంద, స్వామి మాధవానంద హాజరయ్యారు.

ప్రముఖులందరూ పరమహంస యోగానందగారు భారతదేశానికి మరియు ప్రపంచానికి చేసిన ఆధ్యాత్మిక సేవల గురించి మాట్లాడారు మరియు బెంగళూరులోని ఒక ప్రముఖ రహదారికి ఆయన పేరు పెట్టడం ద్వారా అటువంటి సాధువు యొక్క జ్ఞాపకాన్ని సాధారణ ప్రజల మనస్సులో సజీవంగా ఉంచడం చాలా సముచితమని భావించారు. స్వామి శుద్ధానంద 1935లో పరమహంస యోగానందగారి మైసూర్ మరియు బెంగళూరు పర్యటనల గురించి మరియు మొత్తం మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమ గురించి మాట్లాడారు.

దాదాపు 600 మంది హాజరైన ఈ కార్యక్రమంలో స్వామి శుద్ధానంద ఆధ్యాత్మిక ప్రసంగం మరియు భక్తులందరికీ ప్రసాద వితరణతో ముగించారు.

ఉదయం 5:45 గంటలకు ఉత్సవ హారతితో రోజు ప్రారంభమైంది, ఆ తర్వాత ప్రభాత్ ఫెరీ ప్రారంభమైంది. భక్తిశ్రద్ధలతో భజనలు, ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు.

బెంగళూరు ఇప్పుడు మన ప్రియతమ గురుదేవులు పరమహంస యోగానందగారి పేరుతో ఒక రహదారిని కలిగి ఉన్న భారతదేశంలోని 13వ నగరంగా అవతరించింది. గతంలో నగరాల్లోని కొన్ని ప్రధాన రహదారులు: ఇగత్‌పురి, జమ్మూ, కడప, లలిత్‌పూర్, లక్నో, నాగ్‌పూర్, నోయిడా, నూజివీడు, రాజమండ్రి, రాజ్‌కోట్, రాంచీ మరియు విశాఖపట్నంలకు “పరమహంస యోగానంద పథ్” లేదా “పరమహంస యోగానంద మార్గ్” అని పేరు పెట్టారు.

బెంగుళూరులోని “పరమహంస యోగానంద రోడ్డు”, యోగదా సత్సంగ ధ్యాన మందిరానికి సరిగ్గా ఎదురుగా ఉంది మరియు 3.3 కి.మీ. పొడవు గల రహదారి, జాతీయ రహదారి 4ని ఒక చివర ఇందిరానగర్ ప్రధాన రహదారికి మరొక చివర కలుపుతుంది.

ఇతరులతో పంచుకోండి