ప్రతి సంవత్సరం క్రిస్టమస్ సమయంలో సాధారణంగా ఉండే వాటికంటే ఎక్కువగా, శక్తివంతమైన క్రీస్తు-ప్రేమ మరియు ఆనందం యొక్క ప్రకంపనలు స్వర్గ లోకాల నుండి భూమిపైకి ప్రసరిస్తాయి. ఏసు జన్మించినప్పుడు భూమిపై ప్రకాశించినట్లుగానే ఆకాశం అనంతమైన కాంతితో నిండిపోతుంది. భక్తి మరియు గాఢమైన ధ్యానం ద్వారా అనుసంధానంలో ఉన్న వ్యక్తులు, ఏసుక్రీస్తులో ఉన్న సర్వవ్యాపక చైతన్యపు పరివర్తనకారక ప్రకంపనలను స్పష్టమైన రీతిలో అద్భుతంగా అనుభవిస్తారు.
— పరంహంస యోగానంద
క్రిస్టమస్ పవిత్ర సందర్భంగా, ఏసు క్రీస్తు జయంతిని గౌరవించేందుకు గురువారం డిసెంబర్ 25న ఒక ప్రత్యేక ఆన్లైన్ ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం, అనంతరం నియమిత సమయంపాటు స్ఫూర్తిదాయక పఠనం మరియు నిశ్శబ్ద ధ్యానం కూడి ఉన్నాయి. ఇతరుల కోసం ప్రార్థన, పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ఒక ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం సమాప్తమయ్యింది.
క్రిస్టమస్ పర్వదినాన స్మారకోత్సవ కార్యక్రమాలను వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా నిర్వహించాయి. మీకు దగ్గరలో ఉన్న కేంద్రాన్ని కనుగొనేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గారి క్రిస్టమస్ సందేశం
క్రిస్టమస్ సందర్భంగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారి ప్రత్యేక సందేశం చదవడానికి దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి.
ఈ పవిత్ర సందర్భంలో విరాళం సమర్పించాలని మీరు భావిస్తే, క్రింద ఉన్న లింక్ ద్వారా సమర్పించవచ్చు. మీ మద్దతు ఎంతో అభినందనీయం.

















