శ్రీ పరమహంస యోగానందుల స్వేచ్ఛ భావన (ఆత్మాధీనత) పై స్వామి చిదానంద గిరి

6 అక్టోబరు, 2020

శ్రీ పరమహంస యోగానంద 1920 అక్టోబరు 6న “ది సైన్స్ ఆఫ్ రిలిజియన్ (మత విజ్ఞాన శాస్త్రము)” అనే అంశంపై అమెరికాలో చేసిన మొదటి ప్రసంగానికి 100 సంవత్సరాలు నిండాయి, మత స్వేచ్ఛను కోరుతూ అమెరికా తీరం చేరిన యాత్రికుల 300వ వార్షికోత్సవ గౌరవార్ధం బోస్టన్లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రిలిజియస్ లిబరల్స్ అనే ఈ కార్యక్రమంలో “స్వేచ్ఛకు నిజమైన అర్థం” ని చర్చించే సమావేశంలో ఆయన ఉపన్యసించారు.

వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి (పరమహంసగారి పశ్చిమ దేశ ఆగమన సంస్మరణ శతాబ్ది) 19 సెప్టెంబరు, 2020న, పరమహంసగారు స్వేచ్ఛ అనే అంశాన్ని ఎలా స్పృశించారో తన ప్రసంగ సారాంశంలో ప్రతిబింబించారు. ఆయన నిజమైన స్వేచ్ఛ యొక్క ఆదర్శాన్ని యోగ శాస్త్ర దృక్పథం ద్వారా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉందని బోధించారు—ఇది శారీరక ధ్యాస నుండి ఆత్మను ఎలా విముక్తం చేయాలో బోధిస్తుంది—మరియు విశ్వజనీన ధ్యాన పద్ధతుల ద్వారా సాక్షాత్కారం పొందవచ్చు.

Swami Chidananda Giri on Paramahansa Yogananda’s Concept of Freedom
Play Video

ఇతరులతో పంచుకోండి