నూతన సంవత్సరాన్ని మీరు నాటవలసిన ఒక తోటగా భావన చెయ్యండి. ఈ నేలలో మంచి అలవాట్లనే విత్తనాలను నాటి, పూర్వం నుండి ఉన్న చింతలు, చెడు కర్మలనే కలుపు మొక్కలను తొలగించండి.
— పరమహంస యోగానంద
నూతన సంవత్సర ఆరంభంలో సామూహిక ధ్యాన సాధన చేసే సంప్రదాయాన్ని పరమహంస యోగానందగారు ప్రారంభించారు. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో గాఢమైన ధ్యానం చేయమని, మరియు చెడు అలవాట్లను విడిచిపెట్టి వాటి స్థానంలో మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని భక్తులను ఆయన ప్రోత్సహించారు.
ఒక ప్రత్యేక ఆన్లైన్ నూతన సంవత్సర ప్రారంభ సామూహిక ధ్యానం బుధవారం, డిసెంబర్ 31 రాత్రి 11:30 నుండి గురువారం, జనవరి 1, ఉదయం 12:15 (భారతీయ కాలమానం) వరకు నిర్వహించబడింది. ఈ ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఆంగ్లంలో నిర్వహించారు.
నూతన సంవత్సరాన్ని ధ్యానంతో ప్రారంభించే ఈ అద్వితీయమైన పద్ధతిని మా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, మరియు మా కొన్ని కేంద్రాలు, మండళ్ళు కూడా పాటించాయి.
మీరు వీటిని కూడా పరిశోధించడానికి ఇష్టపడవచ్చు:
ఈ నూతన సంవత్సర సందర్భంలో, పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతావాద కార్యాలకు సహాయం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విరాళం సమర్పించడానికి దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి.

















